Category: Uncategorized

ఆర్మూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు….

ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయము 4 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగర్ కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఏసిపి వెంకటేశ్వర…

స్నేహ సొసైటీ రక్త పరీక్షల శిబిరం..

A9 న్యూస్/ఎల్లారెడ్డి,నిజామాబాద్ రూరల్: ఎల్లారెడ్డి పల్లెలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ వారి సౌజన్యంతో రక్త పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని స్నేహ సొసైటీ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సెక్రెటరీ…

నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్:

హైదరాబాద్: జనవరి 09 మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరుకాను న్నారు. ఉదయం 9:30కి నంది నగర్ నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ కారు…

35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు:

అపూర్వ కలయిక 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల: A9 న్యూస్ వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 35 సంవత్సరాల తర్వాత పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి…

నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ

A9 న్యూస్ ఆర్మూర్: -తెలంగాణ పండగలు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు -నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ తెలంగాణ పండగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ శేల్లి చౌదరి అన్నారు. ఆర్మూర్…

నూతనంగా వచ్చిన భీమ్ గల్ సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

సిఐ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సదాశివ్ రిపోర్టర్ భీమ్ గల్ బాల్కొండ నియోజకవర్గo, భీంగల్ సర్కిల్ ఇన్సెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన భీంగల్ సిఐ పి.నవీన్ కుమార్ ను భీంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పరిచయం…

నిజామాబాద్ లోని బబన్ స పహాడీలో గల పెయింటర్ కాలనీలోని తస్లీమ్ సుల్తానా ఇంట్లో చోరీ…

నిజామాబాద్ లోని బబన్ స పహాడీలో గల పెయింటర్ కాలనీలోని తస్లీమ్ సుల్తానా ఇంట్లో చోరీ… దొంగలు ఇంట్లో తాళం పగలగొట్టి ఐదు తులాల వెండి నాలుగు వేల రూపాయలు నగదును దొంగిలించారు. వేసవి సెలవులు కావడంతో తల్లి గారి ఇంటికి…

బాల రాముని అయోధ్య దర్శనానికి బయలుదేరిన ఇందల్వాయి శ్రీ సీతారామచంద్రస్వామి రామాల స్వాములు

ఇందల్వాయి నుండి బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం లో ప్రతి సంవత్సరం మాలాదరణ స్వాములు అయోధ్య బాల రాముని దర్శనానికి రామ మాల స్వాములు బయలుదేరడం జరిగింది వీరు తిరిగి ఉండల్వాయి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవం లో తిరిగి 25న పాల్గొనుటకు…

వేములవాడ రాజన్న కు తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచురణార్థం **రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* **వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి జాతర* **భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి* **టిటిడి దేవాలయం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి* —————————— వేములవాడ,మార్చి -07: ——————————- మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. వేములవాడ ఆలయంలో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం *రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ* వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి సమర్పించడం జరిగిందని, అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించామని అన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో స్వయంగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉందని కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి రాలేకపోయారని, ఎన్నికల కోడ్ రాకపోతే ప్రస్తుత వారంలో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయాన్ని సందర్శిస్తారని మంత్రి తెలిపారు. రాజన్న భక్తులుగా తాము వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పలు దఫాలు చర్చించామని, మాటలకే పరిమితం కాకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకున్నామని అన్నారు. మహాశివరాత్రి జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని కొరుతూ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న *ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ* దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా బీసీ రవాణా శాఖ మంత్రి ప్రత్యేకంగా పరివేక్షిస్తున్నారని అన్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు విభాగాలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారని అన్నారు. సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా వృద్ధులకు రావాలని స్వామివారిని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. —————————————————-