ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ )

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని సి.సి.ఆర్.బి యందు విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ శ్రీ ఎ. దయానంద్ రావు గారు తేది: 5-8-2023 నాడు తన స్వస్థలం భాగ్యనగర్, నిర్మల్ జిల్లా యందు గుండె నొప్పి వచ్చి మృతి చెందినారు.

దయానంద్ రావు గారు 1983 లో కానిస్టేబుల్గా భర్తీ అయి 2018 లో ఎస్.ఐ గా ప్రమోషన్ పొందినారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు సంతానం గలదు.

ఇట్టి అంత్యక్రియలకు నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (ఎల్ & ఓ ) శ్రీ ఎస్. జయ్ రామ్ గారు హజరయి పార్దీవ దేహం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులనుఒదార్చినారు.

ఇట్టి అంత్యక్రియలు నిర్మల్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా గారు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *