కామారెడ్డి కలెక్టరేట్లు జిల్లాలోని 49 మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లు శనివారం రెండు దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రాజు తెలిపారు. మద్యం దుకాణం 02 కు అడ్లూరు గ్రామానికి చెందిన ఆర్. ప్రశాంత్ రెడ్డి రెండు దరఖాస్తులను దాఖలు చేశారని చెప్పారు. ఈనెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యక్తులు గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *