జులై 31

సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు మండల కేంద్రంలోని బోయ గల్లికి చెందిన కోతల శ్రీనివాస్ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు కుటుంబీకులంతా ఓ గదిలో నిద్రిస్తుండగా ఆ గదికి గడియ పెట్టి మరో గదిలోకి చొరబడ్డ దుండగులు 3.5 తులాల బంగారు ఆభరణాలు 40 తులాల వెండి ఆభరణాలు అపరించుకుపోయారు సంఘటన స్థలానికి చేరుకున్న భీంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం గ్రామాల్లో దొంగల అలజడి ఎక్కువగా ఉందన్న కారణంగా యువకులు గస్తీ తిరగాలని అపరిచిత వ్యక్తులు తారసపడితే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *