A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:  

ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ టీచర్స్ కాలనీ క్షత్రియ పాఠశాలలో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవిత మాట్లాడుతూ తల్లిదండ్రులు, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు అనే బంధాన్ని దేవుడు ఇచ్చిన వరం అయితే తాను సొంతంగా ఏర్పరచుకునే ఒక గొప్ప బంధం స్నేహితుడు అని నిజమైన స్నేహితుడు దొరకడం ఒక గొప్ప వరం అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *