50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న చేపల మార్కెట్‌ భవనానికి సంబంధించిన స్థల పరిశీలించిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మరియు జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్…

డిచ్ పల్లి మండలం : మండల కేంద్రంలో రేపటి రోజున రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితమ్మ లతో కలిసి 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న చేపల మార్కెట్‌ భవనానికి శంకుస్థాపన భూమి పూజ చేయనున్నారు, ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నేడు స్థల పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక మండల ఎమ్మార్వో ఎమ్మార్వోకి ఆర్ఐ కి మత్య్స శాఖ అధికారుకు, రేపటి పోగ్రం కోసం పనులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ , స్థానిక జెడ్పిటిసి లక్ష్మీ నరసయ్య , మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ రెడ్డి , మిట్టపల్లి ఎంపిటిసి, మండల ప్రధాన కర్యధర్శి హరికిషన్ , మోహన్ రెడ్డి , నడిపిఅన్న, అమీర్, చక్కర కొండ కృష్ణ గారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *