జక్రాన్ పల్లి A9 News :

పద్మశాలి రాజ్యాధికార సాధనలో భాగంగా ఈనెల 13న తలపెట్టిన పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పోస్టర్ మండల పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ పద్మశాలి కన్వీనర్ దాస్ మాట్లాడుతూ ఈనెల 13న తలపెట్టిన పద్మశాలి ఆత్మగౌరవ సభను పద్మశాలీలు విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సభకు పద్మశాలి యువతీ యువకులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో పద్మశాలి పాల్గొని కోరుట్ల సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రూరల్ అధ్యక్షుడు లోలం జగదీష్, మండల యువజన సంఘం అధ్యక్షుడు అంకం నరేష్, జిల్లా చేనేత సంఘం కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షులు చాట్ల శ్యామ్, పద్మశాలి ప్రతినిధులు శ్రీనివాస్ సత్యనారాయణ లక్ష్మణ్, రాజు వివిధ గ్రామాల పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *