https://youtu.be/SnpnEvm0jBY

కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ వయసు 22సం.లు అదే గ్రామానికి చెందిన రజిత అనే అమ్మాయిని సంవత్సరం కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న… కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి సంసారం ఈమధ్య వారిద్దరి మధ్య గొడవలు రావడంతో విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అయితే శుక్రవారం రోజున స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. తన భర్త ఇక మారడు, నేను తన వద్దకు వెళ్ళనంటూ మొండికేయడంతో… మృతుడు సుకృత్ ఇక నా భార్య రాదేమోనని మనస్థాపన చెంది నందిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో అందరూ చూస్తుండగానే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్నా వారంతా తేరుకొని అడ్డుకునేంతలోపే మందు తాగేయడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పడంతో కుటుంబ సభ్యులు జిల్లా ప్రతిభ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సుకృత్ ఆరోగ్య పరిస్థితి చేయి దాటడంతో ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో చనిపోయినట్టు వైద్యులు తెలిపారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై హరిబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *