[కొండగట్టు వరకు బాబాపూర్ హనుమాన్ స్వాముల పాదయాత్ర…

 

ఫొటో : పాదయాత్రగా బయలుదేరుతున్న హనుమాన్ స్వాములు…

 

తేదీ 21(సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ). 

 

 నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన హనుమాన్ స్వాములు ఆదివారం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. 41 రోజులు హనుమాన్ మాల ధరించి నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారికీ పూజలు నిర్వహించి భజన పాటలు ఆలపిస్తూ జై శ్రీరామ్ అనే నినాదాలతో కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే అంజన్న స్వామి వద్దకు గత సంవత్సరం కూడా పాదయాత్ర ద్వారా వెళ్లి దర్శనం చేసుకొని కోరికలు కోరుకొని వస్తే, ఆ కోరికలు పలించాయి. పంచాబుతాల అధిపతి ఆంజనేయ స్వామి ని అందరు ఆరాధించి ఆశీస్సులు పొందాలని అన్నారు. పాదయాత్రగా బయలుదేరి వెళ్ళిన వారిలో హనుమాన్ స్వాములు, శేఖర్ స్వామి, జగదీశ్ స్వామి,నితిన్ స్వామి, నవీన్ స్వామి, శశి స్వామి వారితో పాటు బచ్చగొని మహేష్,గడ్డం సతీష్ ఉన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *