నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 7:

 

నందిపేట మండల కేంద్రంలో వివాహితపై యువకుడి అత్యాచార యత్నం చేసిన ఘటన బాధితురాలు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి ఓ జంట వలస వచ్చి గత నాలుగు సంవత్సరాలుగా నందిపేట మండల కేంద్రంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఆమె భర్త కూలి పని కోసం బయటకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంట్లో మహిళ ఒంటరిగా ఉంది. అది గమనించిన కొట్టూరు రాము అనే యువకుడు ఆమె ఇంట్లోకి వెళ్లి తనకు సహకరించాలని కావాలంటే డబ్బులు ఇస్తానని అత్యాచారానికి యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రామును పట్టుకొని దేహ శుద్ధి చేశారు. మహిళ ఆమె భర్తకు ఫోన్ చేయగా అతను వచ్చే లోపు యువకుడు పారిపోయాడు. దీనిపై బాధితురాలు నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *