నిజామాబాద్ A9 న్యూస్: 

నందిపేట మండలంలో పత్రిక సమావేశం నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొమిరే సుధాకర్ హాజరై. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మరి కేవలం బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు చట్టసభల్లో సామాజిక వాటనీ కేటాయిస్తూ 60 నుంచి 70 సీట్లు ప్రకటించడం జరిగింది. అందులో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గండికోట రాజన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది.

 

ఆయనను ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీలు ఓట్లు వేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించవలసిందిగా బాధ్యత ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుంకరి నాగరాజ్, నందిపేట్ మండల అధ్యక్షులు బోర్రల్ల సురేష్, డంకేశ్వర్ మండల అధ్యక్షులు బంటు రాజేశ్వర్ బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *