బాసర మండల కేంద్రంలో నిన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు బాసర మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు.. దానికి నిరసనగా కిషన్ రెడ్డి గారు దీక్ష చేపడితే దీక్ష నుండి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తరలించడం జరిగింది దీన్ని బాసర మండల శాఖ తరపున ఈరోజు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్టులు తో మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేస్తా మని ఆనుకుంటున్నారు కానీ మీ వల్ల ఏమీ కాదు.. వచ్చేది బిజెపి ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి తో పాటు ఏ శాఖల ఎన్ని ఉద్యోగాలు ఉంటే తక్షణమే భర్తీ చేస్తామని బిజెపి శాఖ తరపున ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం..

ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షులు పి సాయినాథ్, బాసర మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, టౌన్ అధ్యక్షులు జిడ్డు సుభాష్, దేవరాజు, బిద్దుర్ రమేష్, ch సాయినాథ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *