A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్:

 

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యు వాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *