A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:

-మాలల సింహగర్జనను విజయవంతం చేయండి:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ అతిథి గృహంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీన జరిగే మాల సింహగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్జి. చెన్నయ్య

మాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు అలుక కిషన్ కో-చైర్మన్లు బురుగుల వెంకటేశం, ఎడ్ల నాగరాజు, అమృత్, కామారెడ్డి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆర్గనైజింగ్ సెక్రెటరీలు సుతారి సుధాకర్, ఎడ్ల రాజులు మాట్లాడుతూ మాలలు మాల ఉపకులాలు కామారెడ్డి జిల్లా ప్రాంతం నుండి అధిక సంఖ్యలో పాల్గొని. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి మరియు పట్టణ ప్రాంతాల నుండి మాలలు మాల ఉపకులాలు ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరి చొప్పున ప్రతి గ్రామస్థాయి నుండి సుమారు 50 మందికి పైగా మాలల సింహగర్జనకు సింహాల వలె వచ్చి సభను విజయవంతంచేయగలరని కోరుతున్నామన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు గోనుగొప్పుల లింగం, కామారెడ్డి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మీసాల సత్యం, మీసాల భూపతి, బొల్లిగద్ధ కృష్ణ, చెవుల రవి, పిట్ల నవీన్, మ్యాధరీ నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *