A9 న్యూస్ ప్రతినిధి:

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తర మండల రూరల్ సిఐగా బుక్కా శ్రీనివాస్ గురువారం బాధ్యతలును స్వీకరించారు. ఇక్కడ పని చేసిన సతీష్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న బుక్క శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఐని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు మర్యాదపూర్వకంగా పుష్పవిషమంద చేసి కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఉత్తర రూరల్ మండలం పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్న పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. పోలీస్ శాఖ నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరంఆయన ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *