A9 న్యూస్ ప్రతినిధి:

 

వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రముఖ క్రీడాభిమాని చేపూర్ మనోహర్ రెడ్డి 25 మందికి జతల క్రీడా దుస్తులను గురువారం అందజేశారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటలు కూడా బాగా రాణించి పాఠశాలకు విద్యార్థులు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఊరుకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదగాలని విద్యార్థులను దీవించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు మనోజ్ రెడ్డికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్,మహేందర్,గణేష్, నరసింహారావు,ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *