A9 న్యూస్ ప్రతినిధి:

పలుమార్లు ప్రమాదం జరిగిన అటువైపు తొంగి చూడని ప్రభుత్వ అధికారులు

ప్రాణాలు పోతేనే స్పందిస్తారా…?

ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వేయాలని డిమాండ్ – పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిమండల కేంద్రం లో పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, డిచ్ పల్లి రైల్వే స్టేషన్లో జాగ్రత్త వహిస్తు ఆగిన గూడ్స్ బండి దాటుతుండగ గాయం తగిలిందని వారు తెలిపారు. ఇదే ప్రాంగణం నుండి ప్రతి రోజు స్కూల్, కాలేజీ పిల్లలు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయదారులు, ప్రజలు ఇలా రోజు వేలమంది ఈ గూడ్స్ బండి దాటుతుంటారు. అందులో ఎందరికి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో ఎవరు చెప్పుకోలేక పోతున్నామన్నారు. ఈ జనాల బాధలు ప్రభుత్వాలకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారని ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వాలు స్పందించడం లేదని అనేక మార్లు ప్రమాదాలు కూడా జరిగినప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరేతినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈ గూడ్స్ బండి క్రిందపడి అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత స్పందిస్తారా..? చెప్పండి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వెయ్యాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *