A9 న్యూస్ ప్రతినిధి:

– తెలంగాణ రాష్ట్ర పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దూషించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామని ఉత్తర తెలంగాణ రాష్ట్ర పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులను అవమానకర రీతిలో దూషించి అసభ్యకరంగా మాట్లాడారన్నారు. హిందువుగా పుట్టిన రాకేష్ రెడ్డి హిందువులనే దూషించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన మాటలను ఉపసంహరించుకోవాలని లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకుంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. హిందువుగా పుట్టి హిందువులను దూషించి అవమానిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు రూప, భాగ్య, వజ్రమ్మ పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *