A9 న్యూస్ ప్రతినిధి:

ఆర్మూర్ మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పటైన పల్లె (హరిపూర్) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు. గురువారం ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మహిళ కమ్యూనిటీ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షునిగా లక్కవత్రి రాజేందర్ అలియాస్ రామ్ సన్, ఉపాధ్యక్షునిగా జోరీగె ధర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అది సంతోష్, కోశాధికారిగా కొంపల్లి భూమేష్, ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూరకంటి చిన్నారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకొబడ్డ కమిటీకి శాలువా కప్పి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకున్ని గెలిపించుకోవాలని ఆయన సూచించారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందేలా చూడాలని కమిటీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో చేపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి ఎల్క రంజిత్, పల్లె విడిసి అధ్యక్షుడు సుంకపక రవి, ఏనుగుంటీ లింబద్రి గౌడ్, సర్దా గంగాధర్, చిన్న గంగాధర్, తోటపల్లి దేవరాజ్, అది శ్రీను, కటికే లక్ష్మణ్, బోజేందర్, సాయ గౌడ్, మంగలి శ్రవణ్, వినోద్, సురేష్,తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *