A9 న్యూస్ ఆర్మూర్:

ఆర్మూర్ మండల విద్యాధికారి రాజా గంగారాం నూతనంగా ఏర్పడిన ఆర్మూర్ మండల ఎస్.జి.టి అధ్యక్షులు పొన్న ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఇతర కార్యవర్గ సభ్యలు అరవింద్, బసంత్, బాలనంద్, చంద్రశేఖర్, మెట్టు గంగారాం, ప్రవీణ్ గౌడ్, శ్రావణి, రోజా మర్యాద పూర్వకంగా కలిసి ప్రాథమిక పాఠశాల పరిస్థితుల గురించి, ఎస్.జి.టి లు ఎదుర్కొంటున్నా సమస్యల గురించి చర్చించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలల మరియు ఎస్.జి.టి ల విషయంలో కూడా ఏ సమస్యలు ఉన్న తన పరిధిలో ఖచ్చితంగా వాటి పరిష్కారం చేస్తానని ఎం.ఈ.ఓ తెలపడం జరిగింది. అలాగె ఎస్.జి.టి లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి విషయంలో ఎస్.జి.టి లు ఐక్యంగా పోరాడాలని సూచించారు. మీ పోరాటంలో తన వల్ల ఏ అవసరం ఉన్న ముందుంటానని తెలిపి ఎస్.జి.టి లలో మనోబలాన్ని నింపారు. ఇట్టి కార్యక్రమంలో శిరీష, రంజిత, నాగరాజు, మహేందర్, రాజారాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *