A9 న్యూస్ ఆర్మూర్: 

ఆర్మూర్ ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా క్లాత్ స్టోర్ యజమాని ముక్క ధనుంజయ గుప్తా వారి సోదరుడు సంజయ్ గుప్తా వారి తండ్రి కీ//శే//. ముక్క సుదర్శన్ గుప్తా వారి జ్ఞాపకార్థం సందర్భంగా సేవా భారతి (సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరు పేద బడుగు బలహీన వర్గాల ఆవాస వసతి గృహాలకు దాదాపు లక్ష రూపాయల విలువగల, 2000 దుస్తులు సేవ భారతి అనుబంధ సంస్థ నచికేత ఆవాసం కమిటీ ప్రధాన కార్యదర్శి పుప్పాల రాజేందర్ కి అందజేశారు. సేవ భారతి 

పేదల జీవన ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం. సేవా భారతి అభాగ్యులకు సహాయం చేయడానికి ప్రజలను సమీకరించింది. తెలంగాణలో 3,500 కార్యకలాపాలతో సహా దేశంలో మొత్తం 1,50,000 ధార్మిక మరియు సమాజ అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి.

విద్య | ఆరోగ్యం | సాధికారత | సామాజిక సమానత్వం పనిచేస్తున్న సంస్థ. ఈ కార్యక్రమంలో పుప్పాల రాజేందర్, సంజయ్ గుప్తా, విశ్వహిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ పాల్గోన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *