*విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు*

 

 *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

, సెప్టెంబర్ 02 : భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన (కూడా) సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

———————–

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *