A9 న్యూస్ ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రికి వస్తున్న ప్రజలకు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలపై మరియు జాగ్రత్తలు పాటించాలని అవగాహనలు కల్పించినట్లు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే ఆసుపత్రికి రావాలన్నారు. ఆస్పత్రిలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రికి వస్తున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నామని తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *