A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, ఆగస్టు 16:

ఆర్మూర్ పట్టణం లోని టీచర్స్ కాలనిలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల పేరెంట్స్ సామూహిక వరలక్ష్మీ వ్రతం లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావడం జరిగినది. ప్రముఖ వేంకటేశ్వర ఆలయం పంతులు అయినా ఆనంద్ పంతులు ఆధ్వర్యం లో సామూహిక వర లక్ష్మీ వ్రతం కార్యక్రమము జరిగినది. ఈ పూజా కార్యక్రమములో జిల్లా కార్య దర్శి రవి నాధ్, పాఠశాల మేనేజ్మెంట్ భాను తేజ, పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మాతాజీ లు సోనాలి, శైలజ, మంజుల, సింధుజా, లత, ప్రియాంక, వేద, నిహారిక, అంజలి తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *