A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:

ఆర్మూర్ నియోజకవర్గం మిర్ధపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఇటీవలి పదోన్నతి మరియు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కే.నరేందర్ బి.శంకర్ మరియు డి.మమత మరియు వ్యాయమ ఉపాధ్యాయులు జి.రాజేష్ మరియు ఎస్.శ్రీనివాస్ లకు ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వి డి సి మరియు ఎస్ఎంసి సభ్యుల సమక్షంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తమతమ అనుభూతులను అనుబంధాలను పంచుకున్నారు విద్యార్థులు కూడా తమ ఉపాధ్యాయులతో ఉన్న అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషియర్ ఏనుగు సాయి రెడ్డి (మాము), వైస్ క్యాషియర్ భాను ప్రకాష్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నూతపల్లి భూమన్న, గడ్డం గంగారెడ్డి, దొడ్ల మహేందర్, ఎల్లుల శ్రీకాంత్ పాల్గొన్నారు. అదే విధంగా ఎస్ఎంసి సభ్యులు జంపాల సురేష్, మారంపల్లి మహిపాల్, గజారి మోహన్, కళ్ళెం అశోక్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *