A9 న్యూస్ ఆర్మూర్ క్రైమ్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో మారుతి(29) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యారేజ్ యజమాని వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మృతుడు తాను పనిచేస్తున్న గ్యారేజీ యజమాని నాగబాబు ఇంటి నుండి వెళ్లాడు. మంగళవారం ఉదయం తోటి డ్రైవర్లు డ్యూటీకి వెళ్లేందుకు మారుతి ఉంటున్న గ్యారేజీకి వెళ్లారు. మారుతి ఎంత పిలిచినా వినకపోవడంతో స్టూల్‌పై ఉన్న దుప్పటి తీసేయగా.. తన స్టూల్‌పై చీమలు పాకుతున్నాయని అనుమానం వచ్చి యజమాని 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రవికుమార్, ఎస్సై అశోక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *