A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి :

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఐదో జాబితా ఎంపీ అభ్యర్థులను లిస్టును బీజేపీ రిలీజ్ చేసింది.మొత్తం 107 మందికి ఈ లిస్టులో చోటు దక్కగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలంగాణలోని మిగిలిన రెండు స్థానాలు అయిన ఖమ్మంకు తాండ్ర వినోద్ రావు, వరంగల్ కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అరకు స్థానానికి కొత్తపల్లి గీత, అనకాపల్లికి సీఎమ్ రమేశ్, రాజమండ్రి స్థానానికి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం స్థానానికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతికి వరప్రసాద్ రావు, రాజంపేట పార్లమెంట్ స్థానానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *