ఆర్మూర్ A9 న్యూస్ ప్రతినిధి:

ఆర్మూర్ పట్టణంలో సంతోష్ నగర్ కు చెందిన లాస్య కుటుంబాన్ని ఐద్వా నాయకులు పరామర్శించడం జరిగింది. లాస్య అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన నిందితుడు హత్య జరిగిన స్థలంలో చాకు ఐఫోన్ అక్కడే వదిలినప్పటికీ హత్య జరిగే మూడు రోజుల్లో అవుతున్న ఇప్పటివరకు నిందితుల ఆచూకీ దొరకకపోవడం గమనార్ధం ఈ విషయంపై ఆర్మూర్ పోలీస్ వ్యవస్థ స్పెషల్ ఫోకస్ పెట్టి నిందితులను అదుపులో తీసుకొని లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని లాస్యకు ఎనిమిది నెలల పాప కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకపోతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే చాలా రకాల చట్టాలు ఉన్నప్పటికీ అవి కొంతమందికి చుట్టాలుగా మారి అగైత్యాలకు పాల్పడుతున్న కొంతమంది దుండగులకు గుణపాఠం చెప్పే విధంగా పోలీస్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐద్వా డిమాండ్ లేదంటే లాస్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమం చేపడతామని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షురాలు అరుణ జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *