A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

* మృతుడు పాత నేరస్తుడిగా గుర్తింపు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బండి గంగాధర్ (64) మానసిక పరిస్థితి సరిగా లేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

గంగాధర్ మానసిక స్థితి బాగా లేక కుటుంబ సభ్యులతో సఖ్యత లేక మనోవేధనతో విద్యానగర్ కాలనీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు గత రెండు నెలల క్రితం హత్య చేసిన ఘటనలో నిందితునిగా జైలు శిక్ష అనుభవించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ తెలిపారు. మృతుడు డయాలసిస్ రోగి కావడంతో బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు, ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *