తమాషా చేస్తున్నావా నువ్వెవ్వడివి

ధరకాస్తు దారుడుపై చిందులు వేసిన ఎంపిడిఓ

సోషల్ మీడియాలో వైరల్

  1. భీంగల్ మార్చి 6( A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం ) భీంగల్ పట్టణానికి చెందిన ఓ సామాన్య పౌరుడు బుదవారం ఎంపిడిఓ కార్యాలయంలో ధరకాస్తు చేసుకోవడానికి వచ్చాడు. ఆఫీస్ సమయం మించి పోయినప్పటికీ ఎంపిడిఓ రాకపోవడం తో ఫోటోలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపిడిఓ గంగుల సంతోష్ కుమార్ సదరు ధరకాస్తు దారుడు గుడాఫ్ సందీప్ కుమార్ తన ఛాంబర్ లోకి రాగానే ఫొటోస్ తీసింది నువ్వేనా అని అడిగాడు.దీనికి సందీప్ అవును అని బదులిచ్చాడు.ఎవరు నువ్వు అని అడిగితే సందీప్ నేను సామాన్య మానవున్ని అన్నాడు . అంతే దీంతో ఎంపిడిఓ కోపంతో ఊగిపోతూ ఫోటో ఎందుకు తేశావు హు ఆర్ యూ , యూస్ లెస్ ఫెళ్లో అంటూ ఊగిపోయి .తమాషాలు చేస్తున్నావా. నేను ఆఫీస్ కి ఎప్పుడు వస్తె నీకేంటి నాకు వంద పనులుంటాయి నన్ను అడగడానికి నువ్వేవిడివి అంటూ ఊగిపోయారు.ఈ వీడియో నీ సదరు ధరకాస్తు దారుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఈ అధికారిపై చీదరించుకుంటున్నారు. ఓ బాధ్యతగల అధికారి ఇలా ప్రవర్తించడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *