నిజామాబాద్ A9 న్యూస్,

బాల్కొండ ఫిబ్రవరి 13:

కుకునూర్ మరియు కోమన్ పల్లి గ్రామస్తులు 2012 కాంగ్రెస్ పార్టీ హయాంలో కేటాయించిన ఇందిరమ్మ ప్లాట్ లకు పట్టాలు ఇప్పించవలసిందిగా ఆర్.డి.ఓ వినోద్ కుమార్ కి వినతి పత్రం అందించారు. కోమన్ పల్లి కుకునూర్ గ్రామాల కు సంబంధించిన సర్వేనెంబర్ 491, 492, 493 నందు 50 + 30 =80 ప్లాట్లను కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉండగా ఇందిరమ్మ గృహా పథకంలో లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. ఆ తదనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక నాయకులు చొరవ తీసుకొని గతంలో కేటాయించిన భూములను లబ్ధిదారులకు పట్టా చేసి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రవీణ్, గుండ్ల నారాయణ, రహీం, పుప్పాల భూలక్ష్మి, రాపతి విజయలక్ష్మి, శాంతాపురం, రజిత, బేగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *