నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 5:

 

ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన షేక్ నహీం కూతురు షేక్ మహేరా 7 సంవత్సరాల పిల్ల తప్పిపోయిందని పాప తండ్రి 100 కి ఫోన్ చేసి పోలీసులకు వివరాలను తెలియజేశారు. దీనీనీ స్పందించిన పట్టణ సిఐ వి.రవి కుమార్, ఆదేశాల మేరకు పోలీసులతో ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

రాజారాం నగర్ కాలనీ నుండి మూగదైన పాప ఆడుకుంటూ మామిడిపల్లి చౌరస్తా వరకు వెళ్ళింది. పాపను వెతికే క్రమంలో కానిస్టేబుల్ రాములు, హోంగార్డు స్వామి పాపను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. తదననంతరం పాప తండ్రికి కాల్ చేసి సిఐ సమక్షంలో తండ్రి షేక్ నహీం కి అప్పగించారు. చాకచక్యంతో పాపను పట్టుకున్న కానిస్టేబుల్, హోంగార్డును సిఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *