కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది తరుపున వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ యువకుడు గైని శ్రీకాంత్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవి కాలంలో గ్రామం అభివృద్ధి సర్పంచ్ సంబు లలిత బాయి, ఉప సర్పంచ్ పసుల సాయిలు, వార్డ్ సభ్యులు హరీష్ ఎంతగానో కృషి చేస్తారని వారి సేవలు మరువలేనిమని అన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం అభివృద్ధి పరంగా గ్రామాన్ని తీర్చిదిద్దని వారి పదవీకాలం ముగియడంతో బాధాకరమని భూంపల్లి గ్రామ యువకుడు గైని శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కారోబర్ రమేష్, మొగ్గం సాయిలు, కర్దూరం మధుసూదన్, వాగుమరి నందం, దేవి లింగం మహిళా సంఘ సభ్యురాలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *