కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 2:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఐకెపి రాజిరెడ్డి, ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఐకెపి రాజిరెడ్డి మాట్లాడుతూ భూంపల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని గ్రామంలో ఏదైనా సమస్య నా దృష్టికి వచ్చిన గాని వాటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్క నిధులను గ్రామ ప్రజలతో చర్చించి గ్రామంలో ఏమేం సమస్యలు ఉన్నాయో ఆ నిధులతో పనులు చేయిస్తానని స్పెషల్ ఆఫీసర్ ఏపిఎం ఐకెపి రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్ సిసి రాములు మాజీ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *