నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 1:

  నందిపేట్ మండల కేంద్రంలోని నంది గుడి ఆలయ ప్రాంగణంలో సుందరీకరణ, వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణం పనులు శ్రీశ్రీశ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించడం జరిగింది. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి, అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలను జరుపుతామని ఆలయ కమిటీ చైర్మన్ మచ్చర్ల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కిషన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నవీన్, మచ్చర్ల చిన్న సాయన్న, ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *