హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: రథానికి తగిలిన విద్యుత్ తీగలు, ఐదుగురు మృతి….

On: Monday, August 18, 2025 10:14 AM

శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లోని రామంతాపూర్‌లో జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఊరేగింపు రథం విద్యుత్‌ తీగలకు తగిలిన కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు అవడం అత్యంత హృదయవిదారక విషయం.

మృతుల వివరాలు:

కృష్ణయాదవ్‌ (24),

శ్రీకాంత్‌రెడ్డి (35),

సురేష్‌ (34),

రుద్రవికాస్‌ (39),

రాజేంద్రరెడ్డి (39.

ఈ ఘటన ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పండుగ వేళ జరగాల్సిన ఉల్లాసం ఒక్కసారిగా విషాదంగా మారడం బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

20 Aug 2025

Leave a Comment