కామారెడ్డి A9 న్యూస్:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి స్టేజి వద్ద ఉన్న అంబరీశ్వర స్వామి దేవాలయం 34వ ప్రత్యేక పూజ కార్యక్రమం జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 34 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా అంబరీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రజలు శ్రీ అంబరీశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చారు శ్రీ అంబరీశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉందని వచ్చే కార్తీకమాసం వరకు శ్రీ అంబరీశ్వర స్వామి ఆలయం పూర్తవుతుందని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *