నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉదయం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వయంగా అంకాపూర్ లో, ఆర్మూర్ సిద్దుల గుట్ట ఆలయం లో కుటుంబ సమేతంగా రామాలయంలో పూజలో పాల్గొన్నారు. రాముని పదాలు పల్లకి సేవలో పాల్గొన్నారు. మామిడిపల్లిలో రాముని విగ్రహానికి అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇస్సపల్లి, ఆలూరు, వన్నెల్, సిద్దపూర్, వెల్మల్,బోర్గాం ఆలయాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయోధ్య కళా 500 ఏండ్ల నాటిది అని ప్రతి హిందూ గర్వించదగ్గ సందర్భం అని దేశం, ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది అని రాముడు అంటే గుణంలో ఆదర్శం అని ప్రతి ఒక్కరు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని ఇంతటి మహోత్సర కార్యక్రమం చేపట్టిన మోది చరిత్రలో నిలిచిపోతారు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ఆలూరు మండల్ అధ్యక్షులు గిరీష్ మాజీ జడ్పిటిసి తల పీర్ సింగ్ స్థానిక గ్రామాల భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *