నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివలింగానికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించి, అయోధ్య రామ మందిరప్రారంభోత్సవం బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామనామ మంత్ర యజ్ఞం నిర్వహించడం జరిగింది. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులందరూ శ్రద్ధ భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం నిత్య ప్రసాదం మహా అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ కిషన్, క్యాషియర్ ఎర్రం నడిపిముత్యం, గ్రామాభివృద్ధికమిటీ అధ్యక్షులు ఎర్రం నవీన్, మచ్చర్ల చిన్న సాయన్న, బంటు ప్రసాద్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, 39 కులాల సర్వసమాజ్ పెద్దమనుషులు గ్రామప్రజలు యువకులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *