నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కేంద్రంలోని జెండా బాలాజీ మందిరంలో స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశంలో వారం రోజుల పాటు ప్రతి ఊరిలో ఉన్న దేవాలయా లను శుభ్రం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ మందిరంలో శుద్ధికరణ నిర్వహించారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈనెల 22న అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఊర్లో ఉన్న దేవాలయాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు భాషెట్టి రాజ్ కుమార్, కార్తీక్ సింగ్, ఉదయ్ గౌడ్, మిర్యాల్కర్ కిరణ్ రాము, పల్లె శ్రీనివాస్, రవి,శివ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *