నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

నిజామాబాద్ నందిపేట్ మండల కేంద్రంలో  ఈరోజు నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ, నందిపేట ప్రజలు, సమావేశమై నందికేశ్వర ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ గా చింతల కిషన్ ముదిరాజ్, కోశాధికారిగా ఎర్రం నడిపిముత్యం, డైరెక్టర్లుగా ఎర్రం ప్రవీణ్, దుబాయ్ శీను, తాటికాయల సుభాష్, ఆర్మూర్ గంగారం, మూడేడ్ల లింగం, విట్టల్, గణేష్, వాల్గోట్ రాజు, కుమ్మరి శ్రీకాంత్, సుంకరి సుమన్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నందిపేటకి తలమానికమైన నందికేశ్వర ఆలయాన్ని, మరింత అభివృద్ధి చేస్తామని, నందిపేట గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ఆలయ ఆస్తుల రక్షణ ధ్యేయంగా పనిచేస్తామని, నూతన కార్యవర్గం తెలపడం జరిగింది. నూతన కమిటీకి గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *