నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం

ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంట్లో మర్యాదపూర్వకంగా, శుక్రవారం పెర్కిట్ పూసల సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. అధ్యక్షులు పొదిల కిషన్ మాట్లాడుతూ పూసల సంఘ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది. దానికి ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పనిసరిగా సంఘభవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని సంఘ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది.

ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను నాతో ఎంత మేరకు నిధుల విడుదల అవుతుందో అంత మేరకు నియోజకవర్గ కుల సంఘాలకు అందరికీ సహాయం చేస్తానని ఈ మేరకు ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెర్కిట్ పూసల సంఘం అధ్యక్షులు పొదిల కిషన్, అధ్యక్షులు మదినేని చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి, సుంకరి గంగా మోహన్, ఉపాధ్యక్షులు, చెరుకు కిషోర్, కోశాధికారి, చేని సుదర్శన్, కార్యదర్శి దుర్గాప్రసాద్, మాజీ అధ్యక్షులు మదినేని నరేష్, తదితర సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *