నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ కార్యాలయం రియల్ ఎస్టేట్ అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. అలాగే ఇట్టి విషయంపై కలెక్టర్ గారు కూడా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనియెడల కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ద్యాగ ఉదయ్ పులి యుగంధర్ విజయానంద్ పీర్ సింగ్ ఖందేశ్ ప్రశాంత్ చిన్నారెడ్డి నగేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *