నిజామాబాద్ A9 న్యూస్:        

     ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్ర కు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి తన టీఎస్ 11 ఇఎస్ 5157 కారులో బంగారం తీసుకువచ్చి మహాలక్ష్మి కాలనీలోని మహాలక్ష్మి మందిరంలో పూజలు చేయడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న కిలోన్నర బంగారం కనిపించడం లేదని బాధితులు వాపోయారు.

ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివాహ శుభకార్యాలు ఉన్నందున తమకు సంబంధించిన బంగారాన్ని బ్యాంకు నుండి తీసుకువచ్చారా లేక సదరు బాధితులు వడ్డీ వ్యాపారానికి సంబంధించిన బంగారం బ్యాంకు నుండి విడిపించుకుని తీసుకువచ్చార అని తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని తనిఖీలు చేపట్టారు, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సందర్శించినట్లు సమాచారం. కారులో ఉన్న బంగారం చోరీకి గురవడంతో పట్టణవాసుల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం చోరీ అవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *