నిజామాబాద్ A9 న్యూస్:

ముప్కాల్ మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో “అమ్మ నాన్న గురువు శతక పద్యార్ఛన” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు వంద తెలుగు సంఘాల సమన్వయంతో 100 దేశాలలో “వందే విశ్వమాతరమ్” పేర్లతో నిర్వహించిన “శాంతి సద్భావన యాత్ర” లో భాగంగా శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలను విద్యార్థులందరూ కలిసి సామూహిక గానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన తానా సంఘం వారికి మరియు ఛైర్మన్ షరీఫ్ కి, పాఠశాల ప్రిన్సిపాల్ కోలు ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు అమ్మా, నాన్న, గురువుల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించినందుకు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ చవాన్ మరియు ఉపాధ్యాయులు, ఇన్చార్జులు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *