కామారెడ్డి A9 న్యూస్:

సదాశివ నగర్ మండలంలోని భుంపల్లీ గ్రామానికి చెందిన జోగు సాయిలు అనే వ్యక్తి జీవన ఉపాధి లేక భూంపల్లి గ్రామంలో ఒక చిన్న షెడ్డు వేసుకొని అక్కడ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాడు నిరుపేదకుటుంబంలో పుట్టి వికలాంగ వైఖరితో గ్రామంలో తనను చిన్నచూపు చూస్తూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చెప్పులు కుట్టుకుంటూ భార్యా బిడ్డలను పోషిస్తున్నాడు, అతను చెప్పులు కుట్టుకుంటూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి అని గ్రామస్తులు అంటున్నారు. అతనిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు వికలాంగుని కోటాలో ఒక్క ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆయన పథకాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన వేడుకుంటున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *