నిజామాబాద్ A9 న్యూస్:

*ఎమ్మెల్యేను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు

*జర్నలిస్టుల సంక్షేమానికి సహకరించాలని వినతి

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బుధవారం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి శంకర్, దూద్వాడ్ శ్రీనివాసులతో పాటు ఉపాధ్యక్షుడు చిరంజీవి కార్యవర్గ సభ్యులు జాఫర్ అలీ, సైఫ్ అలీ, పట్టెం సతీష్, హమెద్ అలీ, జనార్ధన్, నవీన్, జోయల్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే తో సంక్షేమం వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వివరించారు. గత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందు లాంటి పథకాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్మూర్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తప్పనిసరిగా జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా వారి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఐకమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *