నిజామాబాద్ A9 న్యూస్:

*అంగడి బజార్ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

 

*లోకల్ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.


*అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం.


*ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.

 

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రైతు బజార్, అంగడి బజార్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్లోని మరుగుదొడ్లను, అస్తవ్యస్తంగా మారిన మడిగేలను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని సదుపాయాలు తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానన్నారు. అంగడి బజార్ రూపురేఖలను త్వరలోనే మారుస్తామని, అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. లోకల్ రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. తరువాతనే వేరే వారికి ఇక్కడి స్థలం ఎవడి అబ్బా సొత్తు కాదన్నారు. దళారులు సైతం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, కలిగోట గంగాధర్, ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *