నిజామాబాద్ A9 న్యూస్:

https://youtu.be/hJfqomCSCBM?si=8P1SyIjCCnQ39q4O

 

హాస్టల్ వసతి గృహంలో రాత్రి పదిన్నర సమయంలో నిద్రించే సమయంలో స్థలం వివాదం ఘర్షణకు దారి తీసింది. గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంటున్న రుక్మిణి అదే తరగతికి చెందిన మన్మిత మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది ఇరువురు విద్యార్థులు ఘర్షణ పడగా రుక్మిణి కి కడుపులో తీవ్ర గాయాలు అయ్యాయి.

అపరస్మార్క స్థితిలో ఉన్న రుక్మిణి ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని రుక్మిణి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ఘటన సమయంలో వాచ్మెన్ రాజగంగు విషయాన్ని హాస్టల్ వార్డెన్ ఫర్ జన బేగంకు సమాచారం అందించారు.

ఘటన ఆర్మూర్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహంలో చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు సైతం రాత్రికి హాస్టల్ కు చేరుకుని విద్యార్థిని పరిస్థితి పై హాస్టల్ వార్డెన్ కువివరాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *