నిజామాబాద్ A9 న్యూస్:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని గడ్కొల్ గ్రామంలో నవ యువ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవ యువ యూత్ అధ్యక్షులు సండ్ర శంకర్ మాట్లాడుతూ సమాజంలో కుల మత వర్గ విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపన అందరికీ విద్య సమానం పనికి సమాన వేతనం కావాలని సమాజంలో అసమానతలు తొలగాలని కుల నిర్మూలన వాటిపైన పోరాడిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నవ యువ యూత్ సభ్యులు రంజిత్, పిట్ల మార్క్స్, ఎండి హర్షత్, మందాపురం రాజు, మనోజ్, రాజేశ్వర్, బాబురావు, భరత్, ప్రియానంద్ ఆశన్న, అజయ్, ప్రమోద్, బన్నీ, సాత్విక్, కట్ట బాలయ్య, సిరికొండ సురేందర్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *